కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ కుమారుడు దివంగత పిళ్ళా భరత్ జయంతి కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. నార్త్ ఏసీపీ అప్పలరాజు

కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ కుమారుడు దివంగత పిళ్ళా భరత్ జయంతి కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. నార్త్ ఏసీపీ అప్పలరాజు

మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : మార్చ్ 08: 

 7వవార్డ్ కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ కుమారుడు దివంగత పిళ్ళా భరత్ కుమార్ (నాని) 31వ జయంతి సందర్భంగా పిలకవానిపాలెం పాత విజయం పాఠశాల ఆవరణంలో మెగా రక్తదాన శిబిరం, వైద్య శిబిరం, వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. రక్త దాన శిబిరంలో మహిళా దినోత్సవం నాడు మహిళలు సైతం రక్తదానం చేసారు. ఈ రక్త దాన శిబిరం మరియు వైద్య శిబిరంలో గీతం వైద్యాలయంలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు మంగమ్మ తెలిపారు.
ఈ టోర్నమెంట్ లో విశాఖలో వివిధ ప్రాంతాల నుండి 18 టీంలు పాల్గొంటున్నాయి అని కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్ మంగమ్మ ఏర్పాటు చేసిన మహిళలకు చీరలు ఆటో కార్మికులకు యూనిఫార్మ్ గంటా శ్రీనివాస్ అందచేశారు. రక్తదాన శిబిరంలో రక్తం దానం చేసిన దాతలకు గుర్తింపు ధ్రువ పత్రాలను ఎమ్మెల్యే గంటా, కార్పొరేటర్ మంగమ్మ చేతుల మీదుగా అందచేశారు. సుమారు వెయ్యి మందికి పైగా అన్నదానం కార్యక్రమంలో అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో నార్త్ ఏసీపీ అప్పలరాజు 8వవార్డ్ కార్పొరేటర్ లోడగల అప్పారావు, పిళ్ళా వెంకటరావు టీడీపీ సీనియర్ నేతలు మొల్లి లక్ష్మణరావు, వాండ్రాసి అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.