ఆర్టీసీ కాలనీ పరిసర ప్రాంతాలలో విస్తృత ప్రచారం నిర్వహించిన కూటమి అభ్యర్థులు.
భీమిలి : వి న్యూస్ : ఏప్రిల్ 27:
జనసేన టిడిపి బిజెపి పొత్తులో భాగంగా 7వవార్డ్ జనసేన అధ్యక్షులు నాగోతినరసింహ నాయుడు ఆదేశానుసారం టిడిపి నాయకులుతో కలిసి ఏడవ వార్డు మల్లయ్య పాలెం, ఆర్టీసీకాలనీ ఇంటింటి ప్రచారంలో భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాస్ రావుకు, విశాఖ పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ భరత్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పెనుగొండ గంగరాజు,కొల్లి శంకర్రావు, ఇమంది అప్పారావు ( అప్పు ),పోతిన తిరుమల రావు ,ఆకుల శివ,వావులపల్లి చిన్న,త్రినాధ్,శ్రీను ప్రచారంలో తదితరులు పాల్గొన్నారు.