అందరి సహకారంతో అప్పన్న ఆలయ అభివృద్ధి :ట్రస్టు బోర్డు నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన ఈవో

అందరి సహకారంతో అప్పన్న ఆలయ అభివృద్ధి :ట్రస్టు బోర్డు నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన ఈవో

త్వరలోనే దర్మ  కర్తల మండలి సమావేశం నిర్వహణ:

శ్రీశ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం: 

సింహచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని అందరి సహకారంతో మరింతగా అభివృద్ధి చేద్దామని దేవస్ధానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. మంగళవారం కొండ దిగువన దేవస్దానం ఈవో కార్యాలయంలో ధర్మకర్తల మండలి సభ్యుల నుంచి ఆయన సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పించాల్సిన మెరుగైన సదుపాయాలు, త్వరలో పూర్తిచేయనున్న పనుల వివరాలను ధర్మకర్తల మండలి సభ్యులు ఈవో దృష్టికి తీసుకెవెళ్లారు. నగరంలో ఉన్న అప్పన్న ప్రహ్లాద కళ్యాణమండపం దేవస్ధానం స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని ట్రస్టుబోర్డు సభ్యుడు గంట్ల శ్రీనుబాబు ఈవోను కోరారు. అంతేకాకుండా పైడితల్లమ్మ, బంగారమ్మ, సత్తెమ్మ తల్లి అనుబంధ ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఇఓ ను కోరారు. సింహగిరి కి భక్తులకు స్వాగతద్వారాలు ఏర్పాటు చేయాలని శ్రీనుబాబు సూచించారు. మరో సభ్యుడు వారణాసి దినేష్‌రాజు మాట్లాడుతూ వీలైనంత త్వరగా ధర్మకర్తల మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు ఈవో సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే అజెండాను సిద్దం చేస్తున్నామని, త్వరలోనే సమావేశం నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. మరో సభ్యుడు దొడ్డి రమణ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు తక్షణమే పూర్తిచేయాలన్నారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యులు  ఆయా అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో కూడిన లేఖలను ఈవోకి అందజేశారు. అనంతరం సభ్యులంతా ఈవోను ఘనంగా సత్కరించారు. సమావేశంలో సభ్యులు గంట్ల శ్రీను బాబు , దినేశ్ రాజ్, దొడ్డి రమణ,ఎస్‌.శ్రీదేవి, శ్రీదేవి వర్మ,వంకాయల సాయి నిర్మల, 

ఎం. రాజేశ్వరి,బయ్యవరపు రాధ, డి.రామలక్ష్మీ, పాత్రుడు, ప్రత్యేక ఆహ్వానితులు నర్సింహమూర్తి, చందు యాదవ్‌ తదితరులంతా పాల్గొని సలహాలు, సూచనలు అందజేశారు.