జగన్‌ నాలుగేళ్ల పాలనలో అవినీతి అరాచకాలు తప్ప మరేమి లేదు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

జగన్‌ నాలుగేళ్ల పాలనలో అవినీతి అరాచకాలు తప్ప మరేమి లేదు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా 

విశాఖ : వి న్యూస్ : జూన్ 11: 

జగన్‌ నాలుగేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు తప్ప మరేమీ లేదని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. విశాఖలోని రైల్వేస్ గ్రౌండ్‌లో జరిగిన సభలో మాట్లాడిన అమిత్ షా.. అల్లూరి, తెన్నేటి విశ్వనాథాన్ని స్మరిస్తూ ప్రసంగం ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం, యూపీఏ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఏపీలో 25 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని అమిత్ షా (Amit Shah) ప్రజలను కోరారు.

కేంద్రం నిధులు ఇస్తుంటే.. జగన్ తన ఫొటో పెట్టుకొని ప్రజలను మభ్యపెడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. రేషన్ బియ్యం మోదీ ఇస్తుంటే.. జగన్ తన ఫొటో వేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని జగన్ చెప్పుకుంటున్నారు కానీ.. రైతుల ఆత్మహత్యల విషయంలో జగన్ సిగ్గుపడాలన్నారు. రైతుల ఆత్మహత్యల విషయంలో.. ఏపీ మూడో స్థానంలో ఉందన్న అమిత్ షా.. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం విద్రోహ శక్తుల కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఈ 9 ఏళ్లలో ఏపీ అభివృద్ధి కోసం మోదీ భారీగా నిధులు ఇచ్చారని వివరించారు మన్మోహన్ సింగ్ హయాంలో అవినీతి జరిగినా చర్యలు తీసుకునే సత్తా లేక పోయింది కానీ బీజేపీ పాలనలో పుల్వామా ఘటన జరిగిన 10 రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నాం. సర్జికల్ స్ట్రైక్‌తో పాక్‌కు బుద్ధిచెప్పాం పదేళ్ల యూపీఏ పాలనలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగింది మోదీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. అందుకే 2024 ఎన్నికల్లో కూడా మోదీనే గెలిపించాలి 300 పైకి ఎంపీ స్థానాల్లో మళ్లీ విజయం సాధిస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.