మేకను అమాంతం మింగేసిన కొండచిలువ.. వణికిపోయిన స్థానికులు.

మేకను అమాంతం మింగేసిన కొండచిలువ.. వణికిపోయిన స్థానికులు

అనకాపల్లి జిల్లా :

అనకాపల్లి జిల్లాలో కొండచిలువ కలకలంరేపింది. నక్కపల్లి మండలం, చుక్కల వాని లక్ష్మీపురం గ్రామంలో ఏకంగా ఓ మేకను మింగేసింది. కొండచిలువ మేకను మింగేసి ఇబ్బందిపడింది.. కొంతమంది స్థానికులు గుర్తించి కొండ చిలువ ను చంపేశారు.. అనంతరం మేకను బయటకు తీశారు. కొండ చిలువను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. ఈ కొండచిలువ ఎక్కడి నుంచి వచ్చిందోనని స్థానికులు టెన్షన్ పడుతున్నారు. మేకను మింగింది కాబట్టి సరిపోయిందని.. అదే చిన్ని పిల్లలు అక్కడే ఉంటే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.